మనిషి ప్రగతి వైపు పయనిస్తున్నాడు. ఆర్ధికం గ ఎంతో ఉన్నతి సాధిస్తున్నాడు. ప్రకృతి వడిలో పుట్టి, ఆ తల్లి నీడ వదలి ఆశల ఎండమావుల వైపు పరుగెడుతున్నాడు. ఆ బాట లో , ఆ పోటీ లో కోల్పోతున్నదేదో సున్నితం గా చెప్పే ఆ చిన్ని ప్రయత్నం మనందరి కోసం. ఈ భావ సమాహారాన్ని ప్రేమతో మా నాన్న గారికి అంకితం ఇస్తున్నాను.
మనిషి- మనుగడ !
మెల మెల్లంగ, ఇల మెచ్చంగ సూరీడు నిదుర లేచెను,
అల్లంత దూరాన, కొండల్ల వెనుకంగ ఎర్రంగ పొద్దు పొడిచెను,
చల చల్లంగ, గిలి గింతంగా పిల్ల తెమ్మెర మేను తాకెను,
తనువంత త్రుల్లంగ, కొలనంత మురువంగా తామర నవ్వేను.
చలి దుప్పటి తీసి ధరణి మేను హొయలు వొలికేను,
లే పచ్చిక పై మంచు బిందువులు ముత్యమల్లె మెరిసేను,
మావి చెట్టుపై రాచిలుక ముద్దు ముద్దుగా పలుకు లొలికేను,
ఎర్ర బారిన నింగిపై తెల్ల మబ్బుల మోము సిగ్గుతో కందేను.
సుప్రభాత పూజకై వడివడిగా పూజారి గుడివంక నడిచేను ,
సేవకై వేగమే కదలి రండు అని గుడిగంట గట్టిగ మ్రోగెను ,
మాలగా మారి స్వామి ఎద చేరగా మందార పూలు నిండుగా పూసెను ,
గుడి నున్న 'మా లక్ష్మి' మోము కుంకుమ కాంతుల ధగ ధగ మెరిసేను.
చలి పులికి జడిసి కంబళి కప్పి బద్దకంగా నేను నిదురించెను,
నింగి -నేల, పచ్చిక- పూలు , చెట్టు -చేమ ,నను చూసి జాలి పడెను,
అందమంత ఇంత విందు చేయ చూడ విది ఏమి ఖర్మమనేను,
మనుజుడై పుట్టి 'మనుగడే 'మరిచావు అని పెరటి తులసమ్మ వగచేను....